శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త పారాయణం
- ND.Sharma
- Jun 11, 2018
- 1 min read

శ్లో॥ పద్మాననే పద్మఊరు పద్మాక్షీ పద్మసంభవే| త్వమ్మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం ॥
పద్మం వంటి ఊరువులు ముఖం నేత్రములు కలిగిన ఆ తల్లిని పద్మాక్షీ అమ్మవారిని సేవిస్తే మనకు ఏదీ సుఖములను కలుగజేయునో అవి తప్పక దొరకగలవు. యథాయోగ్యం తథా కురు శ్రీ హనుమద్గిరిపద్మాక్షి అమ్మ చూపులతో ఈ జగత్తును రక్షిస్తూ సిరి సంపదలనిస్తూ ఉన్న పద్మాక్షీ అమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ 10-6-2018 ఆదివారం రోజున ఉ:9-30 నుండి 11:30 వరకు అధిక జ్యేష్ఠ(పురుషోత్త)మమాసం ,ఏకాదశి తిథి, అశ్విని నక్షత్ర మహాపర్వదినం సందర్భంగా 108 (కమలపుష్పాలు) లేదా వివిధ రకాల పుష్పాలతో ఏకాదశ(11 సార్లు)పర్యాయములు గా
శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము మరియు అర్చన
ఈ రోజు నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీయంత్ర సహిత శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త పారాయణం మరియు అష్టోత్తర శతాధిక కమల పుష్పాలతో నిర్వహించడం తద్వార అమ్మవారు మనందరిని సంపూర్ణముగాఅనుగ్రహించినది తేలియపరస్తూ వరుణ దేవుడు కూడ అనుగ్రహించడం జరిగింది
ఆపోవై సర్వా దేవతాః అనగా వర్షం ద్వారా సకల దేవతల అనుగ్రహం కలుగును. పడిన చిరుజల్లు (వర్షం)ద్వారా అమ్మవారు మరియు సకల దేవత ల అనుగ్రహం పరిపూర్ణంగా మనందరికి అందినది ఇందులో ఏవిధమైన సంశయం లేదు.



Comments